గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్..

నల్గొండ జిల్లా దేవరకొండ ( Devarakonda) ఎస్టీ బాలికల గురుకుల (ST Gurukula) పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థిని మాధవి ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కళ్యాణిని ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినిపై ప్రిన్సిపల్ కళ్యాణి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అమృతలు వేధింపులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తల్లి కళ మీడియా ఎదుట వాపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, … Read more

Holiday: రేపు స్కూల్లకు సెలవు..!

november 5 holiday telangana ap

మన పత్రిక, వెబ్​డెస్క్: November 5 holiday కార్తీక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు అనుబంధ సంస్థలు రేపు మూసివేయబడనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సాధారణ పనిదినంగానే కొనసాగుతుంది. అక్కడ విద్యాసంస్థలకు ఆ రోజు ఆప్షనల్ హాలిడేగా మాత్రమే అనుమతించారు.

Chatgpt Pro Free: 12 నెలల పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్…

ఓపెన్‌ఏఐ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్. ChatGPT సబ్స్క్రిప్షన్‌ను ఇప్పుడు 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. దీన్ని పొందడానికి ముందుగా ChatGPT యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైభాగంలో కనిపించే Try Go Free అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత Upgrade to Go అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే పేమెంట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. ఇందులో రూ.2 తాత్కాలికంగా డెబిట్ అయ్యి వెంటనే తిరిగి క్రెడిట్ అవుతుంది. గమనిక: ప్లాన్ … Read more

Lok Adalat: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

Lok Adalat nizamabad november 15

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి జడ్జి భరతలక్ష్మి (GVN Bharathalakshmi) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 1,328 క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, విభేదాలు వచ్చినప్పుడు రాజీ పద్ధతిలో ముందుకు రావడమే … Read more

ఉపాధ్యాయురాలి వివాదం.. కాళ్లు నొక్కించుకున్న ఘటన కలకలం

srikakulam teacher students massage incident

మన పత్రిక, వెబ్​డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహం రేపగా, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించారు. అధికారులు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఏలూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 50 మంది ప్రయాణికులు!

ap eluru lingapalem private bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా, లింగపాలెం మండలం, జూబ్లీనగర్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు … Read more

chevella: 21 మంది మృతి.. 3 నెలల చిన్నారి సహా!

chevella news

మన పత్రిక, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతుల్లో మూడు నెలల చిన్నారి పాప, ఆమె తల్లి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. రోడ్డు పక్కన తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్న దృశ్యం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు … Read more

పాఠశాలలకు 3 రకాల నిధులు విడుదల.. లిస్ట్ ఇదే!

3 interventions grants released school wise list of Rajanna Siricilla

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మూడు రకాల గ్రాంట్లను విడుదల చేస్తూ పాఠశాలల వారీగా జాబితాను విడుదల చేశారు. ఈ నిధులలో ‘కాంపోజిట్ స్కూల్ గ్రాంట్’, ‘GCEC గ్రాంట్స్’, మరియు ‘ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్’ (పాఠశాలల్లో హౌస్ సిస్టమ్ ఏర్పాటు) గ్రాంట్లు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సహా పలు మండలాల్లోని పాఠశాలలను ఈ … Read more

బీసీ హాస్టల్‌లో పాముల కలకలం.. కాంపౌండ్ వాల్ కట్టాలని విద్యార్థుల వేడుకోలు!

nagarkurnool news

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. తమ హాస్టల్ ప్రాంగణం విషపూరితమైన పాములకు స్థావరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌కు సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే తరచూ పాములు, ఇతర సర్పాలు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. దీనికి తోడు హాస్టల్‌లో సరైన బాత్రూంలు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే … Read more

Chevella: ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి! తాండూరులో విషాదం.

chevella 3 sisters die

మన పత్రిక, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Bus accident in chevella) మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ)గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవల బంధువుల … Read more