WhatsApp
Advertisement

AP SSC Exams 2026 : కొత్త షెడ్యూల్ ఇదే!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రంజాన్ పండుగ దృష్ట్యా మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ అనుమతితో ఈ పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యథాతథంగా ఉంటుంది.

Advertisement

ఇంగ్లీష్ మినహా మిగతా పరీక్షలన్నీ పాత తేదీల్లోనే జరుగుతాయని, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

Advertisement