మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. రంజాన్ పండుగ దృష్ట్యా మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ అనుమతితో ఈ పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యథాతథంగా ఉంటుంది.
Advertisement
ఇంగ్లీష్ మినహా మిగతా పరీక్షలన్నీ పాత తేదీల్లోనే జరుగుతాయని, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
