Advertisement
ap school holiday october 31 2025

Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను పొడిగించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడంతో ఈ చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా అప్‌డేట్ ప్రకారం, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 31 వరకు సెలవులు ప్రకటించారు. చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) హెచ్చరించింది.

Advertisement

తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 38,000 హెక్టార్లలో పంటలు, 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 76,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement