AP Ration Cards Issue Date | కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం రేషన్ కార్డు ( AP RATION CARD ) ధారులకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కానుంది.
మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందని తెలిపారు.
AP NEW RATION CARDS FROM AUGUST 25
మొదటి దశలో ఆగస్టు 25 నుంచి విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది.
రెండో దశలో ఆగస్టు 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.
మూడో దశలో సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పాలకొండ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీ ఉంటుంది.
చివరి దశలో సెప్టెంబర్ 15 నుంచి మిగిలిన జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.
ఈసారి పంపిణీ చేసే రేషన్ కార్డులపై QR కోడ్ ముద్రించనున్నారు. ఇది పౌరులకు సౌలభ్యం కలిగిస్తుంది.
- Hit and Run Case : కారు సైడ్ మిర్రర్కి బైక్ తాకిందని బైకర్ను చంపేసిన జంట
- Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!
- TG Inter: ఇంటర్ ఫలితాలు నేడే
- Gold Rates 30 Oct 2025 : 30 అక్టోబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్
- Horoscope 30 Oct 2025 : 30 అక్టోబర్ 2025 గురువారం రాశి ఫలాలు
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

