మన పత్రిక : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు సర్కార్ తీపికబురు అందించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏతో పాటు ఇతర భారీ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన ఈ బిల్లుల కోసం ఉద్యోగులు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో, బకాయిల చెల్లింపులపై తగిన కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతానికి రూ.7,059 కోట్ల మేర పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో నిధుల లభ్యతను బట్టి ఈ చెల్లింపులు సత్వరమే జరిగేలా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించనుంది.
ఇవి కూడా చదవండి :
- Vijay Devarakonda: రణబాలి షూటింగ్.. విజయ్ దేవరకొండ ఫైట్ సీన్ లీక్
- సోషల్ మీడియా యూజర్లకు కేంద్రం షాక్: ఐటీ రూల్స్ సవరణ
- Ramcharan : “పెద్ది” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన గ్లోబల్ స్టార్.. అయినా కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..
- Ramayana Teaser : విడుదలైన “రామాయణ” టీజర్… ఈ దీపావళికే మైథలాజి గ్రాండియర్ విజువల్ వండర్
- విజయవాడ: పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ తమన్నా
