AP Govt Employees DA Dues Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందే తీపి కబురు అందింది. చెల్లించాల్సిన డీఏ బకాయిలలో మొదటి విడతను ప్రభుత్వం విడుదల చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు సోమవారం రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఈ చర్యపై ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలో 90 శాతం బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
మొత్తం బకాయిలు ఆరు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు బకాయిలు ఉండడంతో ఈ ప్రక్రియ కొంత సమయం పడుతుంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కొద్ది మొత్తంలో చెల్లించడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది.
ఇప్పటికే వేతన సవరణ సంఘం, జీతాల పెంపు, డీఏ పెంపు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు ఆగ్రహంలో ఉన్నారు. దసరా లోపు మొత్తం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
