మన పత్రిక, వెబ్డెస్క్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిత్తూరు ఫోక్సో కోర్టు గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది.
పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి (31), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేశాడు. 2023 నవంబర్ 29 లోపు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisement
విచారణ జరిపిన చిత్తూరు ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఎం.శంకర్రావు, నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
