Advertisement
chittoor pocso case

Chittoor pocso case: నిందితుడికి 20 ఏళ్ల జైలు.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు!

మన పత్రిక, వెబ్​డెస్క్: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. చిత్తూరు ఫోక్సో కోర్టు గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది.

Advertisement

పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి (31), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేశాడు. 2023 నవంబర్ 29 లోపు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

విచారణ జరిపిన చిత్తూరు ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఎం.శంకర్రావు, నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement