Advertisement

AP Bar Policy | టెండర్లకు స్పందన లేక గడువు పెంపు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బార్ పాలసీకి మొదటి అడుగే ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలోని 840 బార్లకు టెండర్లు పిలిచినా, మద్యం వ్యాపారులు స్పందించడం లేదు.

కొత్త పాలసీలోని నిబంధనలు ఆచరణాత్మకంగా లేవని, ఖర్చు భారం పెరుగుతుందని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలసీలో స్పష్టత లేకపోవడంతో వారు దరఖాస్తులను బహిష్కరించారు. అసలు గడువు ఈ నెల 26న ముగియాల్సి ఉండగా, స్పందన లేకపోవడంతో ప్రభుత్వం గడువును ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. అయినా వ్యాపారుల వైఖరిలో మార్పు లేదు. పాలసీని సవరించకపోతే వారు పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

Advertisement
Advertisement