Advertisement

Annadata Sukhibhava | 1.04 లక్షల మందికి డబ్బులు జమ.

మన పత్రిక, వెబ్​డెస్క్ :  ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) లోని 1,04,107 మంది రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava ) పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇంతకు ముందు ఈ చెల్లింపులు నిలిచిపోయాయి.

ఈ రైతులతో పాటు, ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరణ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి కూడా రూ.5,000 చొప్పున జమ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం రూ.71.38 కోట్లు విడుదల చేశారు.

Advertisement

మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో అని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. రైతు ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఈ చెల్లింపులు రైతులకు ఊరట కలిగిస్తాయి. ప్రభుత్వం అన్ని అంతరాయాలు తొలగించి పథకం కింద డబ్బులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటోంది.

Advertisement