మన పత్రిక, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేడు వివిధ సమీక్షా సమావేశాలు, ఒక సదస్సులో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో హార్టికల్చర్(Horticulture), మార్కెటింగ్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 11.40 గంటలకు సీఆర్డీఏపై సమీక్ష చేస్తారు.
మధ్యాహ్నం 01.55 గంటలకు విశాఖపట్నం వెళ్లనున్న ముఖ్యమంత్రి, 2 గంటలకు నొవాటెల్లో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 05.45 గంటలకు తిరిగి అమరావతిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
