మన పత్రిక: తిరుమల కాలినడక మార్గంలో ఒక యువతి సినిమా ఫ్లెక్సీని ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారితీసింది. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విజయం సాధించిన సందర్భంగా సదరు యువతి ‘పెద్ది – తిరుమల కాలినడక’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రదర్శించింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తిరుమల పరిసరాల్లో మరియు శ్రీవారి నడకదారుల్లో సినిమాలు, రాజకీయాలు లేదా వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడంపై నిబంధనల ప్రకారం పూర్తి నిషేధం ఉంది. ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగించేలా ఉన్న ఈ చర్యపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహించే భద్రతా సిబ్బంది కళ్లెదుటే ఫ్లెక్సీని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తూ, టీటీడీ భద్రతా విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు: 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
- మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన పలాస కోర్టు
- అమరావతిని క్వాంటం హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కీలక చర్చలు
- హనీమూన్ హత్య కేసులో భార్య బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
- అమరావతిలో పీఎన్బీ క్వాంటం హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
