Advertisement

స్కూల్ టైమింగ్స్ చేంజ్.. కలెక్టర్ ఆదేశాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని ఉత్తర జిల్లాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీలకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఉదయం వేళల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి గురువారం పాఠశాలల వేళలను మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ మార్పులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Advertisement

కొత్త వేళలు ఇవే:

  • పాత సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు.
  • సవరించిన సమయం: ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు.

ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement