WhatsApp
Advertisement

మాదిగల కోసం కర్ణుడిలా నిలబడ్డా.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుపై మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో మిత్రుడి కోసం నిలబడిన కర్ణుడు, బలహీనుల పక్షాన పోరాడిన బర్బరీకుడి పాత్రలను గుర్తుచేస్తూ.. న్యాయం వాళ్ల వైపు ఉన్నందునే తాను మాదిగల వెంట నిలబడినట్లు స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ప్రకటించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని సీఎం గుర్తుచేశారు. గతంలో ఈ పోరాటం చేసినందుకు తనను అసెంబ్లీ నుంచి గెంటేశారని, అయినా తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, పంచడానికి భూములు లేకపోయినా.. మాదిగలకు నాణ్యమైన విద్య, రాజకీయ అవకాశాలు కల్పించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న వర్గాలకు సీఎం తాజా వ్యాఖ్యలు మరింత భరోసానిస్తున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రగతి ప్రణాళిక’ అమలులో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement