మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు.. ప్రధాన రహదారి వెంట ఉన్న సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
బాచుపల్లి-మియాపూర్ రూట్లోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో ఈ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులు అక్కడే నివాసం ఉంటుండటంతో, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో మంటలు మరింత వేగంగా పక్క దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోయినా.. రెక్కల కష్టం కళ్లెదుటే కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దాదాపు రూ.5 కోట్ల మేర భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- CM Revanth Reddy భారీ యాక్షన్ ప్లాన్.. 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి’!
- Balka Suman Bail: జైలు నుంచి బాల్క సుమన్ రిలీజ్.. కోర్టు విధించిన షరతులు ఇవే!
- హీరోయిన్లను ఆ యాంగిల్స్లో ఫోటోలు తీస్తారా? కెమెరామెన్లపై ‘కాంతార’ సప్తమి గౌడ సంచలన వ్యాఖ్యలు!
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
