మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత తగ్గిపోయి, ఎండలు నెమ్మదిగా పెరుగుతున్న వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ వాతావరణ శాఖ (IMD) రాష్ట్ర ప్రజలకు తాజా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంటూ అధికారికంగా ఎల్లో హెచ్చరికలను (Yellow Alert) జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 22వ తేదీన రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక ఫిబ్రవరి 23వ తేదీన వాతావరణం మరింత చల్లబడనుంది. ఆ రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అలాగే ఫిబ్రవరి 24వ తేదీన కూడా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు కొనసాగుతాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే, ఫిబ్రవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని, ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేశారు.
మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో రాబోయే రెండు రోజులు, దక్షిణ కోస్తాలో రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోనూ పలుచోట్ల మోస్తారు వానలు పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఏపీకి ఎలాంటి ఎల్లో, ఆరెంజ్ ప్రమాద హెచ్చరికలు లేవని అధికారులు వివరించారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
