మన పత్రిక వెబ్డెస్క్, మదనపల్లె: వైద్య రంగంలో సాంకేతికత వినియోగంపై చేసిన పరిశోధనకు గాను మదనపల్లె మిట్స్ (MITS) డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. పుగళరసికి డాక్టరేట్ వరించింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఈ పట్టా లభించినట్లు మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ వెల్లడించారు.
‘కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్, ఎవల్యూషనరీ ఆల్గోరిథం’ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడం, వర్గీకరించడం అనే అంశంపై ఆమె ఈ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా మిట్స్ ఛాన్సలర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, విభాగాధిపతులు పుగళరసిని ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
ఆమె పరిశోధన భవిష్యత్తులో వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
