Advertisement

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిల విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’ (Serial Snatcher) లా వ్యవహరిస్తూ విశ్వవిద్యాలయాల భూములను లాక్కుంటోందని మండిపడ్డారు. ఉర్దూ వర్సిటీ భూముల వివాదం నేపథ్యంలో నందినగర్ లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములు తీసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

Advertisement
Advertisement