మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన మరో 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు కేవలం 17 మందే మిగిలి ఉన్నారని ఆయన వెల్లడించారు.
వీరి వివరాలను వెల్లడిస్తూ.. కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్లో ఇద్దరు ఉన్నారని, ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారని డీజీపీ వివరించారు. ఈ 17 మంది తలలపై ప్రభుత్వం మొత్తం రూ.2.25 కోట్ల రివార్డు ప్రకటించిందని పేర్కొన్నారు.
‘ఆపరేషన్ కగార్’ గడువు లోపే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిస్తే పోలీసు శాఖ నుంచి వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
