Advertisement

మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. నేడు, రేపు ఆల్ పార్టీ మీటింగ్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేడు, రేపు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో అఖిలపక్ష సమావేశాలు (All Party Meetings) నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి.

రేపు (మంగళవారం) జిల్లా కలెక్టరేట్ల పరిధిలోనూ ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను అధికారులు సేకరించనున్నారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ లిస్టును ప్రకటించనున్నారు.

Advertisement
Advertisement