ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని, ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్పష్టం చేసింది.
Advertisement
గతంలో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ ను హైకోర్టు మార్చి 2025లో కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా, తాజాగా ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజా తీర్పుతో ఈ వ్యవహారానికి తెరపడినట్లయింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
