మన పత్రిక, వెబ్డెస్క్: పెద్దపల్లి జిల్లాలో (Peddapalli district) పంచాయతీ నిధుల దుర్వినియోగం కలకలం రేపింది. ప్రభుత్వ నిధులను జేబులో వేసుకున్న సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వేటు వేశారు. శనివారం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి శ్రీనివాస్ ఏకంగా రూ.4,17,175 నిధులను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నట్లు విచారణలో తేలింది.
ఇంటి పన్నులో భారీ గండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామంలో రూ.6,31,057 ఇంటి పన్ను వసూలు చేయగా, అందులో కేవలం రూ.3,87,382 మాత్రమే ప్రభుత్వ ఖాతాలో (ఎస్.టి.ఓ) జమ చేశారు. మిగిలిన రూ.2,43,675 నిధులను పక్కదారి పట్టించి సొంతానికి వాడుకున్నారు.
జీతాలు, టీఎస్-బీపాస్ నిధులు కూడా.. అలాగే మల్టీ పర్పస్ వర్కర్ల జీతాల చెల్లింపు కోసం వసూలు చేసిన మొత్తంలో రూ.38,500 నొక్కేశారు. దీనికి తోడు టీఎస్-బీపాస్ ఖాతా నుంచి మరో రూ.1,35,000 దారి మళ్లించారు. మొత్తంగా రూ.4 లక్షలకు పైగా నిధులను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
