మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో టెట్ (TG TET) పరీక్షకు హాజరవుతున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. టెట్ పరీక్ష రాసే టీచర్లకు పరీక్ష రోజున ‘ఆన్ డ్యూటీ’ (OD) సౌకర్యం కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
71,670 మంది టీచర్లకు ఊరట: తెలంగాణ టెట్ (TG TET- జనవరి 2026) పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరుగుతున్నాయి. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ (KGBV), మోడల్ స్కూల్స్, ఇతర సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు 71,670 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ పరీక్ష రోజున సెలవు సమస్య తలెత్తకుండా ఓడీ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
షరతు ఇదే: ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్.. డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఇచ్చినట్లుగానే, మొదటిసారి టెట్ రాస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఒకసారికి పరిమితం చేస్తూ ‘ఆన్ డ్యూటీ’ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
