మన పత్రిక, వెబ్డెస్క్: నల్గొండ జిల్లా (Nalgonda District) నూతన కలెక్టర్ బి. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పరిపాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుక్రవారం తన ఛాంబర్లో తొలిసారిగా రెవెన్యూ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ కీలక ఆదేశాలు:
Advertisement
- ప్రజావాణి ప్రాధాన్యం: ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులకు నామమాత్రపు చర్యలు కాకుండా, ఖచ్చితమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల నుంచి తరచూ ఒకే విషయంపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
- పక్కా రికార్డులు: ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే బాధితులకు రశీదు ఇవ్వాలని, రిజిస్టర్లలో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
- క్షేత్రస్థాయిలో..: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అవసరమైనప్పుడు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిగా భాగస్వాములు కావాలని తెలిపారు.
- నెలవారీ సమీక్ష: ఇకపై ప్రతి నెలా తహసీల్దార్లతో తప్పనిసరిగా సమావేశం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో భూభారతి, పౌరసరఫరాల శాఖ అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
