మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకమైన ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు’ (Musi River Rejuvenation Project) పనులను వేగవంతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. మార్చి 31లోపు అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో సీఎం వెల్లడించిన కీలక అంశాలు:
Advertisement
- నిధులు & అనుమతులు: ఈ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) రూ.4,000 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయని సీఎం తెలిపారు.
- నీటి తరలింపు: గోదావరి జలాలను తరలించి మూసీకి జీవం పోయనున్నారు. మొత్తం 20 టీఎంసీల గోదావరి జలాల్లో.. 15 టీఎంసీలు తాగునీటికి, 5 టీఎంసీలు మూసీలో నిరంతర ప్రవాహానికి వినియోగించనున్నారు.
- గాంధీ సరోవర్: బాపూఘాట్ వద్ద మూసా-ఈసా నదుల సంగమ ప్రాంతాన్ని ‘V’ ఆకారంలో ‘గాంధీ సరోవర్’గా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముడి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు.
- ఎలివేటెడ్ కారిడార్: గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్రణాళిక ఉన్నట్లు సీఎం వెల్లడించారు.
- సర్వమత సామరస్యం: మంచిరేవుల శివాలయ అభివృద్ధి, అలాగే మూసీ తీరంలో గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాలు చేపట్టి మత సామరస్యాన్ని చాటుతామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
