మన పత్రిక, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల చరిత్రలో ‘కత్తుల సమ్మయ్య’ది ఓ ప్రత్యేకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. నక్సలైట్లకు కోవర్టుగా మారి, పోలీసులకు సహకరించి, పీపుల్స్వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన సమ్మయ్య ఉదంతం అప్పట్లో సంచలనం. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేముల సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డీజీపీ రియాక్షన్: నిన్న ఓ జర్నలిస్ట్ కత్తుల సమ్మయ్య గురించి ప్రశ్నించగా.. “అది మన సబ్జెక్ట్ కాదు.. ఎప్పుడో దాటిపోయాం (Closed Chapter)” అని డీజీపీ నవ్వుతూ సమాధానం దాటవేశారని, ఆ ఆన్సర్ తనకు నచ్చిందని సత్యనారాయణ తన పోస్టులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది? (జర్నలిస్ట్ పోస్ట్ సారాంశం): గతంలో డీజీపీ హెచ్.జె. దొర హయాంలో సమ్మయ్యను పోలీసులు శ్రీలంక పంపారని, అక్కడ విమాన ప్రమాదంలో అతను చనిపోయాడని సత్యనారాయణ గుర్తుచేశారు. అప్పట్లో డీజీపీ ఆఫీస్ “Sammayya is no more” అని ఓ ప్రముఖుడికి ఇచ్చినట్లుగా ప్రెస్ నోట్ ఇవ్వడం, సమ్మయ్య భార్యకు అత్యవసరంగా పాస్పోర్ట్ ఇప్పించి శ్రీలంక పంపడం, బేగంపేట ఎయిర్పోర్టుకు మృతదేహాన్ని తీసుకురావడం వంటి ఘటనలపై తాను రాసిన బ్యానర్ కథనాలు అప్పట్లో పోలీసు వర్గాల్లో కలకలం రేపాయని ఆయన రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
