Advertisement

TG News: గురుకులంలో విద్యార్థినిని కర్రతో కొట్టిన వార్డెన్.. వీడియో వైరల్!

మన పత్రిక, వెబ్​డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ భవాని ఓ విద్యార్థినిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.

ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో వార్డెన్ తమను ఇలాగే హింసిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టి, వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

Advertisement
Advertisement