మన పత్రిక, వెబ్డెస్క్: సంక్రాంతి సంబరాల వేళ గాలిపటాలు ఎగురవేయడానికి నిషేధిత చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. ఈ దారం విక్రయించినా, నిల్వ చేసినా, వాడినా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
వ్యాపారులు కేవలం లాభాల కోసం చైనీస్ మాంజా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఎస్పీ హితవు పలికారు. ఈ దారం వల్ల పక్షులు, మూగజీవాలే కాకుండా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని, మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, పతంగుల విక్రయ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారన్నారు. ఎక్కడైనా చైనీస్ మాంజా లభ్యమైతే సీజ్ చేయడంతో పాటు, విక్రేతలపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
