మన పత్రిక, వెబ్డెస్క్: “నా దేశం అంటే నాకు ప్రాణం.. కానీ ఇక్కడి వ్యవస్థను భరించలేకపోతున్నా..” అంటూ బెంగళూరుకు చెందిన టెకీ కమ్ వ్యాపారి రోహిత్ ప్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం 18 నెలల్లో రూ.4 కోట్లు పన్ను నిజాయితీగా కట్టినా, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని, అందుకే ఇండియా వదిలేసి వెళ్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఒక్క రోహిత్ ఆవేదన మాత్రమే కాదు.. గత 14 ఏళ్లలో దాదాపు 20 లక్షల మంది భారతీయులు దేశం విడిచి 135 దేశాలకు వలస వెళ్లారు. దీనికి ప్రధాన కారణం లోపభూయిష్టమైన పన్నుల విధానం, బ్యూరోక్రసీ వేధింపులేనని విశ్లేషకులు అంటున్నారు. నిజాయితీగా పన్నులు కట్టే 5 శాతం మందిని కూడా నిత్యం అనుమానంగా చూడటం, నోటీసులతో వేధించడం వల్లే సంపన్నులు, మేధావులు విదేశాల బాట పడుతున్నారు.
మరోవైపు, లక్షల్లో పన్నులు కడుతున్నా.. దానికి తగ్గ నాణ్యమైన జీవన ప్రమాణాలు (రోడ్లు, వైద్యం, విద్య) దక్కడం లేదన్నది సగటు పౌరుడి ఆవేదన. పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నా, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్న అసహనం యువతలో పెరిగిపోతోంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
