మన పత్రిక, వెబ్డెస్క్: “నా దేశం అంటే నాకు ప్రాణం.. కానీ ఇక్కడి వ్యవస్థను భరించలేకపోతున్నా..” అంటూ బెంగళూరుకు చెందిన టెకీ కమ్ వ్యాపారి రోహిత్ ప్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం 18 నెలల్లో రూ.4 కోట్లు పన్ను నిజాయితీగా కట్టినా, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని, అందుకే ఇండియా వదిలేసి వెళ్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఒక్క రోహిత్ ఆవేదన మాత్రమే కాదు.. గత 14 ఏళ్లలో దాదాపు 20 లక్షల మంది భారతీయులు దేశం విడిచి 135 దేశాలకు వలస వెళ్లారు. దీనికి ప్రధాన కారణం లోపభూయిష్టమైన పన్నుల విధానం, బ్యూరోక్రసీ వేధింపులేనని విశ్లేషకులు అంటున్నారు. నిజాయితీగా పన్నులు కట్టే 5 శాతం మందిని కూడా నిత్యం అనుమానంగా చూడటం, నోటీసులతో వేధించడం వల్లే సంపన్నులు, మేధావులు విదేశాల బాట పడుతున్నారు.
మరోవైపు, లక్షల్లో పన్నులు కడుతున్నా.. దానికి తగ్గ నాణ్యమైన జీవన ప్రమాణాలు (రోడ్లు, వైద్యం, విద్య) దక్కడం లేదన్నది సగటు పౌరుడి ఆవేదన. పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నా, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్న అసహనం యువతలో పెరిగిపోతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
