మన పత్రిక, వెబ్డెస్క్: అసెంబ్లీ సమావేశాల వేళ సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఏకంగా ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
