మన పత్రిక, వెబ్డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
నిబంధనలు ఇవే:
Advertisement
- రోడ్లపై నిషేధం: రోడ్లమీద వాహన ర్యాలీలు తీయడం, గుంపులుగా హంగామా చేయడం, కేక్ కటింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.
- మద్యం సేవించడం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా బాణాసంచా పేల్చినా కేసులు నమోదు చేస్తారు.
- అనుమతి తప్పనిసరి: ఫామ్ హౌస్లు, క్లబ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. సౌండ్ పొల్యూషన్ నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేయకూడదు.
- వాహనదారులకు అలర్ట్: మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు పెడతారు. త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ల మోడిఫికేషన్తో శబ్ద కాలుష్యం చేస్తే వాహనాలను సీజ్ చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
