Advertisement

అసెంబ్లీకి కేసీఆర్: ఎర్రవెల్లి భేటీలో కీలక నిర్ణయం.. డిసెంబర్ 29న హాజరు!

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణపై చర్చించిన ఆయన.. ఈనెల 29న శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఆ తర్వాత బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లి మరో ఉద్యమాన్ని నిర్మించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement