Advertisement

సంక్రాంతి కోడి పందేలు.. ముదినేపల్లిలో భారీ ఏర్పాట్లు

సంక్రాంతి పండుగకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో కోడి పందేల నిర్వహణకు పందెంరాయుళ్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గురజ, పెదపాలపర్రు, వాడవల్లి, వైఎస్ఆర్ కాలనీ తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసే పనులు ఊపందుకున్నాయి. పోలీసులు జూదం సాగనివ్వబోమని హెచ్చరిస్తున్నా, పండుగ సంబరాల పేరుతో పందేలకు సై అంటున్నారు.

గత నాలుగు నెలలుగా ప్రత్యేక షెడ్లలో పందెం కోళ్లను పోషిస్తున్నారు. కాకి, డేగ, నెమలి, పింగళి వంటి జాతి కోళ్లను 2.5 నుండి 3.5 కేజీల బరువు ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పుంజు సామర్థ్యాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం మండలంలో సుమారు 300 పుంజులు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement
Advertisement