Advertisement

నేడు కేసీఆర్ కీలక భేటీ.. రేవంత్ సర్కార్‌పై ఫైర్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో నీళ్ల రాజకీయం భగ్గుమంటోంది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడంపై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు సీనియర్లు పాల్గొని, ప్రభుత్వంపై పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

Advertisement
Advertisement