Advertisement

అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నల్లకుంటలో గుండెలు పగిలే దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణి నిద్రిస్తుండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు తన కుమారుడిని ఇంటి బయట నిలబెట్టడం గమనార్హం.

మంటల్లో చిక్కుకున్న త్రివేణి అక్కడికక్కడే సజీవ దహనమైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి కుమార్తె అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఘటన అనంతరం నిందితుడు వెంకటేశ్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement