మన పత్రిక, వెబ్డెస్క్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, వైద్య సహాయం నిరంతరం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నిన్న (డిసెంబర్ 24) ఒక్కరోజే 73,254 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 4.88 కోట్ల ఆదాయం లభించింది. అలాగే 29,989 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
