Advertisement

రాహుల్ గాంధీ ఫైర్.. చిన్న వ్యాపారులకు అండగా ఉంటా!

మన పత్రిక, వెబ్​డెస్క్: బీజేపీ ప్రభుత్వ విధానాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ మేరకు పోస్టు చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వైశ్య సమాజం నేడు నిరాశలో కూరుకుపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిస్తూ.. చిన్న, మధ్యతరహా వ్యాపారులను తప్పుడు జీఎస్టీ, అధికార సంకెళ్లతో బంధించారని విమర్శించారు. బీజేపీ భూస్వామ్య మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ, వ్యాపారులకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement