మన పత్రిక, వెబ్డెస్క్: 18 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాద కేసులో పోలీసులు కీలక మలుపు తిప్పారు. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారకుడు టిప్పర్ యజమాని లచ్చు నాయక్ (Lachu Naik) అని నిర్ధారించారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో (FIR) అతన్ని నిందితుడిగా చేర్చారు.
పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటి? సామర్థ్యానికి మించి లోడుతో (Overload) ఉన్న టిప్పర్ను అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. వాహన యజమానిగా బాధ్యత వహించాల్సిన లచ్చు నాయక్, నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని నిర్ధారణకు వచ్చారు.
ఘటన పూర్వాపరాలు: ఈ ఏడాది నవంబర్ 3న చేవెళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ వద్ద టిప్పర్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో బస్సులోని 18 మంది ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రమాద సమయంలో లచ్చు నాయక్ కూడా టిప్పర్లోనే ఉండి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని, పూర్తిగా కోలుకున్న తర్వాతే విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
