మన పత్రిక, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి హింసతో రగిలిపోతోంది. ఇంకిలాబ్ మంచ్ నాయకుడు, కరడుగట్టిన నేత ఉస్మాన్ హాది (Usman Hadi) హత్య తర్వాత ఢాకాలో మొదలైన అల్లర్లు ఇంకా చల్లారకముందే మరో ఘాతుకం జరిగింది. సోమవారం బీఎన్పీ (BNP) ఖుల్నా డివిజన్ అధిపతి మోతలేబ్ సిక్దర్పై (Motaleb Sikder) గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉస్మాన్ హాది మరణం తర్వాత దేశవ్యాప్తంగా అశాంతి నెలకొనగా, తాజా కాల్పుల ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను మోహరించింది. 2024 విద్యార్థి ఉద్యమం సమయంలో వెలుగులోకి వచ్చిన ఉస్మాన్ హాది, భారత వ్యతిరేక వ్యాఖ్యలతో పాపులర్ అయ్యారు. ఆయన హత్య తర్వాత బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
