Advertisement

నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు (ఆదివారం) కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీని నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement