మన పత్రిక, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్లో (Jammu Kashmir) శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిష్నా రింగ్ రోడ్డుపై ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో సుమారు 35 మంది విద్యార్థులు గాయపడ్డారు.
సాంబా (Samba) ప్రాంతంలో పిక్నిక్ ముగించుకుని విద్యార్థులతో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు (Fog) కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూ ఎయిమ్స్, జీఎంసీ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
