Advertisement

TGSEB: టెన్త్, ఇంటర్ బోర్డుల విలీనం!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి, ఇకపై ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’ పేరిట ఒకే బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ రైజింగ్ విజన్’ డాక్యుమెంట్‌లో ఈ కీలక అంశాన్ని పొందుపరిచారు.

దేశంలో ప్రస్తుతం కేవలం 6 రాష్ట్రాల్లోనే టెన్త్, ఇంటర్ లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. వీటిని విలీనం చేయడం ద్వారా డ్రాప్ అవుట్ రేట్లు తగ్గించవచ్చని, పరీక్ష ఫలితాలను మెరుగుపరచవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రెండు బోర్డులను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement
Advertisement