Advertisement

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అమెరికా విమానాలే టార్గెట్.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో వాటిని పేల్చేస్తామంటూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే వెంటనే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ మెయిల్‌తో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపు మెయిల్ న్యూయార్క్‌కు చెందిన ‘జాస్పర్ పకార్ట్’ అనే వ్యక్తి నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement