మన పత్రిక, వెబ్డెస్క్: నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు లేని సమయం చూసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
