Advertisement

పూజారి ఇంట్లో 40 తులాల బంగారం, రూ. 6 లక్షలు మాయం.

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.

బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు లేని సమయం చూసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement