మన పత్రిక, వెబ్డెస్క్: నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు లేని సమయం చూసి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
