ఏసీబీ వలలో ‘బిగ్ ఫిష్’.. లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అదనపు కలెక్టర్!
మన పత్రిక, వెబ్డెస్క్: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి పంజా విసిరింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కలెక్టర్ స్థాయి అధికారి లంచం కేసులో చిక్కడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
Advertisement
వెంకట్ రెడ్డి ప్రస్తుతం అదనపు కలెక్టర్ గా ఉంటూనే, డీఈఓ (DEO)గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాల రెన్యువల్ పని నిమిత్తం యాజమాన్యం నుంచి డబ్బు డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ లో డబ్బు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఓ అధికారి పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
