ఏసీబీ వలలో ‘బిగ్ ఫిష్’.. లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అదనపు కలెక్టర్!
మన పత్రిక, వెబ్డెస్క్: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి పంజా విసిరింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కలెక్టర్ స్థాయి అధికారి లంచం కేసులో చిక్కడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
Advertisement
వెంకట్ రెడ్డి ప్రస్తుతం అదనపు కలెక్టర్ గా ఉంటూనే, డీఈఓ (DEO)గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాల రెన్యువల్ పని నిమిత్తం యాజమాన్యం నుంచి డబ్బు డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టరేట్ లో డబ్బు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఓ అధికారి పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
