Advertisement

శబరిమలలో భక్తులపై దాడి… తల పగులగొట్టిన వ్యాపారి.

శబరిమలలో ఉద్రిక్తత: తెలుగు భక్తులపై దాడి.. గాజు సీసాతో తల పగలగొట్టిన వ్యాపారి!

మన పత్రిక, వెబ్​డెస్క్: Sabarimala | శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువైందని ప్రశ్నించినందుకు ఓ షాపు యజమాని ఆగ్రహంతో హైదరాబాద్‌కు చెందిన భక్తుడిపై గాజు సీసాతో దాడి చేయడంతో తల పగిలింది.

Advertisement

అంతేకాక, సదరు భక్తుడి మెడలోని మాలను కూడా వ్యాపారి తెంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగు భక్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా, స్థానికులు మరియు పోలీసులు వ్యాపారికే మద్దతుగా నిలిచారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ తెలుగు భక్తుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు, ఇలాంటి వివక్షాపూరిత దాడులు జరుగుతుండటంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement