Panchayat Elections : త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
జీవో 46 ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవో 46కు విరుద్ధంగా 17 శాతం కూడా మించకుండా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, కేవలం 117 స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
