Group 2 Rankers : 2015 కు చెందిన గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ఫలితాలపై ఇప్పటికే సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారి నియామకాలు రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయడంతో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించినంత పని అయింది.
సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేయగా విచారణ చేపట్టి తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. 2015 లో గ్రూప్ 2 రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దానికి కారణం.. ఆన్సర్ షీట్లలో టాంపరింగ్ జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్టు, ఎంపిక జాబితాను కూడా కొట్టివేస్తున్నట్టు తీర్పు చెప్పింది. తాజాగా ఆ తీర్పును సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
