Wife Suicide : వంట సరిగ్గా చేయట్లేదని తన భార్యను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు ఓ భర్త. ఆ తర్వాత భార్య ఫోన్ చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు.. అక్కడే చావు అంటూ భర్త తిట్టడంతో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే పెళ్లి అయిన శివలింగం, శిరీష దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. వికారాబాద్ జిల్లాలోని మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం.. తన భార్యను వంట సరిగ్గా చేయడం లేదని రోజూ తిట్టేవాడు.
తనకంటే తక్కువగా చదువుకుందని కూడా చులకనగా చూసేవాడు. దీంతో అతడి వేధింపులను తట్టుకోలేని శిరీష అతడిపై తిరగబడటంతో ఆమెను తీసుకెళ్లి తన పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత రోజు శిరీష ఫోన్ చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు అంటూ భార్యను దూషించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక శిరీష మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు భర్తే కారణమని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
