Advertisement

సీఎం రేవంత్‌ను కలిసిన ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు!

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రొబెషనరీ ఐపీఎస్ (IPS) అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రొబెషనరీ ఐపీఎస్‌లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్, రాహుల్ కాంత్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్ఆర్ (RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement