RTC Driver : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై పోకిరీలు బూతులతో రెచ్చిపోయారు. ఈ ఘటన నర్సంపేటలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ లో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. అప్పటికే వాళ్లు ఫుల్లుగా తాగి ఉన్నారు. నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు. నర్సంపేట వచ్చినా దిగకుండా బస్సులో నిద్రపోతుండటంతో వాళ్లను లేపిన కండక్టర్ పై విరుచుకుపడ్డారు.
నిద్రపోతున్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ కండక్టర్ పై బూతుల వర్షం కురిపించారు. నర్సంపేట ఎమ్మెల్యే మా పెదనాన్న అంటూ రెచ్చిపోయారు. డ్రైవర్ సీటు దగ్గరికి వెళ్లి డ్రైవర్ ను కూడా తిట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
